దారుణం.. దుండగుల దాడిలో మాజీ ఎంపీ సహా 8 మంది మృతి..
ఆఫ్ఘనిస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఈస్టర్న్ కోస్ట్ ప్రావిన్స్లో ఓ క్లినిక్లో ఆయుధాలతో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు.
ఆఫ్ఘనిస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఈస్టర్న్ కోస్ట్ ప్రావిన్స్లో ఓ క్లినిక్లో ఆయుధాలతో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 8 మంది మరణించినట్లు జిల్లా పోలీస్ అధికారి ఆదిల్ హైదర్ శనివారం తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నది ఇప్పటి వరకు తెలియరాలేదన్నారు. మృతుల్లో హిజ్బ్-ఈ-ఇస్లామీ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు అబ్దుల్ వలీ ఇక్లాస్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. హిజ్బ్-ఈ-ఇస్లామీ సంస్థ గతంలో యూఎస్, ఆప్ఘన్ ప్రభుత్వాలకు వ్యతిరకంగా పనిచేసిందని.. అయితే 2016లో జరిగిన శాంతి ఒప్పందం తర్వాత.. ప్రభుత్వానికి లొంగిపోయి.. ఓ రాజకీయ పార్టీగా అవతరించిందని సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన దుండగుల దాడిలో హిజ్బ్ ఈ ఇస్లామీ నాయకుడు మరణించాడు. ఆయనతో పాటు మరో ఏడుగుర్ని కూడా దుండగులు చంపేశారు. వీరిలో ఓ కుటుంబానికి చెందిన తల్లి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ అధికారులు ధృవీకరించారు.