Archaeological Discovery:తవ్వకాల్లో 3వేల ఏళ్ల నాటి శవపేటిక, ఆలయం, మాస్క్ లు, ఆటవస్తులు చరిత్రను తిరగరాస్తాయా..!

అతిపురాతనమైన సంస్కృతి సంప్రదాయం గల దేశం ఈజిప్ట్. ఈ దేశ గురించి మనం తలచుకోగానే వెంటనే గుర్తుకొచ్చేవి మమ్మీలు, పిరమిడ్లు. ఎన్నివేల సంవత్సరాలైనా చెక్కుచెదరని పిరమిడ్ కట్టడాల గురించి నాగరికతకు..

Archaeological Discovery:తవ్వకాల్లో 3వేల ఏళ్ల నాటి శవపేటిక, ఆలయం, మాస్క్ లు, ఆటవస్తులు చరిత్రను తిరగరాస్తాయా..!
Follow us

|

Updated on: Jan 18, 2021 | 8:32 PM

Archaeological Discovery: అతిపురాతనమైన సంస్కృతి సంప్రదాయం గల దేశం ఈజిప్ట్. ఈ దేశ గురించి మనం తలచుకోగానే వెంటనే గుర్తుకొచ్చేవి మమ్మీలు, పిరమిడ్లు. ఎన్నివేల సంవత్సరాలైనా చెక్కుచెదరని పిరమిడ్ కట్టడాల గురించి నాగరికతకు జన్మస్థానంగా భావిస్తున్న ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. తాజాగా ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు 3000 సంవత్సరాల క్రితం నాటి చెక్క, రాతి శవపేటికలను గుర్తించారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్రను తిరగరాసే గొప్ప, అద్భుతమైన ఆవిష్కరణ అని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు.

సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిన్‌లో భాగం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ డజనుకు పైగా పిరమిడ్లు, పురాతన మఠాలు, జంతువుల ఖనన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనల్లో ఓల్డ్‌ కింగ్‌డమ్ ఆరవ రాజవంశానికి చెందిన మొదటి ఫారో.. కింగ్ టెటి పిరమిడ్‌ సమీపంలో ఓ పురాతన శవపేటికను, పురాతన ఆలయాన్ని గుర్తించింది.

క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం నాటి చెక్క శవపెటిక భూమికి 40 అడుగుల లోతులో బయటపడిందని ఆర్కియాలజిస్టు చెప్పారు. దీనిపై మరింత పరిశోధన జరిపితే సక్కారా ప్రాంత చరిత్రను.. మరి ముఖ్యంగా 3,000 ఏళ్ల క్రితం ప్రారంభమైన న్యూ కింగ్డమ్ చరిత్రను తిరిగరాస్తుందన్నారు. ఈ శవ పేటికతో పాటు 22 బాణాలు కూడా బయల్పడ్డాయని హవాస్ చెప్పారు. ఒక సైనికుడు పక్కనే అతని గొడ్డలి ఉందని అన్నారు. అంతేకాదు ఆ కాలంలో ఉపయోగించిన మాస్క్‌లు, చెక్క పడవలు, పురాతన ఈజిప్షియన్లు ఆడటానికి ఉపయోగించే ఆట వస్తువులు వంటివి లభ్యమయ్యాయి అని తెలిపారు. ఇక ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక పురాతన ఆలయం కూడా బయటపడింది. ఇది “కింగ్ టెటి భార్య క్వీన్ నిరిట్ యొక్క అంత్యక్రియల ఆలయం” అని పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బయటపడిన వస్తువులపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు.

Also Read: మంత్రి కేటీఆర్‌ను కలిసిన సిడ్నీటెస్టు హీరో తెలుగు తేజం హనుమ విహారి

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..