కేరళ గోల్డ్ స్మఈడీ దర్యాప్తు ముమ్మరంగ్లింగ్ కేసు… నిందితులపై
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితులపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. వారిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ప్రధాన నిందితులైన నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మహమ్మద్ హమ్ జద్ అబ్దుల్ సలాం..
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితులపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. వారిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ప్రధాన నిందితులైన నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మహమ్మద్ హమ్ జద్ అబ్దుల్ సలాం అనే మరో నిందితుడు కూడా అరెస్టయ్యాడు. తనకు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంతో ప్రమేయం ఉన్నట్టు ఇంటరాగేషన్ సందర్భంగా సలాం అంగీకరించాడు. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ అటాచీ అయిన సీపీఓ జయగోష్ గన్ మ్యాన్ కి కూడా పరోక్షంగా ఈ యవ్వారంతో ప్రమేయమున్నట్టు తేలడంతో అతడిని సస్పెండ్ చేశారు. యూఏఈ కాన్సులేట్ జనరల్ తో స్వప్న సురేష్ 138 సార్లు, సరిత్ 45 సార్లు మాట్లాడినట్టు తెలిసింది.