రియా చక్రవర్తి ఆదాయంపై ఈడీ ఇంటరాగేషన్
సుశాంత్ సింగ్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆదాయం, ఆర్ధిక లావాదేవీలు, పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు..
సుశాంత్ సింగ్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆదాయం, ఆర్ధిక లావాదేవీలు, పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలివ్వలేకపోయిందని అధికారులు తెలిపారు. ఉదాహరణకు 2017-18 లో తన ఆదాయం 18 లక్షలని రియా తెలిపిందని, అయితే 2018 మొదట్లో ఆమె ఫిక్స్ చేసిన ఆస్తులు 96 వేలు కాగా 2019 లో అది 9 లక్షలకు పెరిగిందని, దీంతో ఆ తరువాత ఇది 27 లక్షలయిందని వెల్లడయింది. కొన్ని కంపెనీలలో షేర్ హోల్డర్ గా ఉన్న రియా దాదాపు 34 లక్షలు పెట్టుబడి పెట్టిందని, అనంతరం 2018-19 లో ఇది 46 లక్షలకు పెరిగిందని ఈడీ ఆరాలో తెలిసింది. తన సొంత ఆదాయానికన్నా ఆమె ఫిక్స్ చేసిన మొత్తాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా వారు కనుక్కున్నారు.
అయితే ఈ ఆర్థిక లావాదేవీల గురించి తనకన్నా తన ఛార్టర్డ్ అకౌంటెంట్ కే బాగా తెలుసునని, ఆయననే ఈ వివరాలు అడగాలని రియా వారికి సూచించిందట . సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ ద్వారా తనకు లభించిన ఆదాయంతో తను ముంబైలో ఫ్లాట్ కొన్నానని రియా చెప్పినప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలను చూపలేకపోయినట్టు ఈడీ వెల్లడించింది.