సీబీఐ అధికారులకు లంచం కేసులో సానా సతీష్ అరెస్ట్
హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్ని ఈడీ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మటన్ వ్యాపారి మొయిన్ ఖురేషీ మనీ ల్యాండరింగ్ కేసులో సానా సతీష్ని అరెస్ట్ చేశారు. సీబీఐ అధికారులకు లంచం ఇచ్చి, సమన్లు నుంచి తప్పించుకోవాలని చూశాడని సతీష్పై ఆరోపణలున్నాయి. 2017లో మొయిన్ ఖురేషీ వ్యాపారాలపై కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు. మాంసం ఎగుమతుల పేరుతో సతీష్ మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో సీబీఐ మాజీ డైరెక్టర్ ఏపీ సింగ్ను […]
హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్ని ఈడీ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మటన్ వ్యాపారి మొయిన్ ఖురేషీ మనీ ల్యాండరింగ్ కేసులో సానా సతీష్ని అరెస్ట్ చేశారు. సీబీఐ అధికారులకు లంచం ఇచ్చి, సమన్లు నుంచి తప్పించుకోవాలని చూశాడని సతీష్పై ఆరోపణలున్నాయి. 2017లో మొయిన్ ఖురేషీ వ్యాపారాలపై కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు. మాంసం ఎగుమతుల పేరుతో సతీష్ మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో సీబీఐ మాజీ డైరెక్టర్ ఏపీ సింగ్ను సైతం విచారించారు ఈడీ అధికారులు.