ఎగ్జిట్ పోల్స్ వేళ.. ఈసీ తీరుపై రాహుల్ ఫైర్
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రధాని మోదీ, ఆయన గ్యాంగ్కు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా లొంగిపోయిందంటూ ఆరోపించారు. ఈవీఎంల నుంచి మొదలుకుని ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ బీజేపీ మేనేజ్ చేశారని విమర్శించారు. నమో టీవీ, మోదీ ఆర్మీ.. ఇప్పుడు కేదార్ నాథ్ వేదికగా డ్రామాలు చేస్తున్నారన్నారు. ఈసీ గతంలో భయ,భక్తులతో ఉండేదని.. ఇప్పుడు తెగించేసిందని మండిపడ్డారు. From Electoral […]
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రధాని మోదీ, ఆయన గ్యాంగ్కు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా లొంగిపోయిందంటూ ఆరోపించారు. ఈవీఎంల నుంచి మొదలుకుని ఎన్నికల షెడ్యూల్ వరకు అన్నిటినీ బీజేపీ మేనేజ్ చేశారని విమర్శించారు. నమో టీవీ, మోదీ ఆర్మీ.. ఇప్పుడు కేదార్ నాథ్ వేదికగా డ్రామాలు చేస్తున్నారన్నారు. ఈసీ గతంలో భయ,భక్తులతో ఉండేదని.. ఇప్పుడు తెగించేసిందని మండిపడ్డారు.
From Electoral Bonds & EVMs to manipulating the election schedule, NaMo TV, “Modi’s Army” & now the drama in Kedarnath; the Election Commission’s capitulation before Mr Modi & his gang is obvious to all Indians.
The EC used to be feared & respected. Not anymore.
— Rahul Gandhi (@RahulGandhi) May 19, 2019