జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం

జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.2గా నమోదైంది. భూ ప్రకంపనాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 4.20 గంటలకు భూమి కంపించినట్టు స్థానిక అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లేహ్‌లోని పర్వతప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. స్వల్ప భూకంపంతో ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదు. ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు అందలేదని అధికారులు వివరించారు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటనలో […]

జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2019 | 12:15 PM

జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.2గా నమోదైంది. భూ ప్రకంపనాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 4.20 గంటలకు భూమి కంపించినట్టు స్థానిక అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లేహ్‌లోని పర్వతప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. స్వల్ప భూకంపంతో ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదు. ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు అందలేదని అధికారులు వివరించారు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటనలో వెల్లడిస్తామనితెలిపారు.