మిజోరాంలో మళ్లీ భూకంపం

మిజోరాంలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. మిజోరాంలోని చంపాయి ప్రాంతంలో మంగళ వారం రాత్రి 8.08 గంటల ప్రాంతంలో భూకంపం..

మిజోరాంలో మళ్లీ భూకంపం
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 9:36 PM

మిజోరాంలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. మిజోరాంలోని చంపాయి ప్రాంతంలో మంగళ వారం రాత్రి 8.08 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. చంపాయి ప్రాంతానికి నైరుతి దిశగా 27 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

కాగా, శుక్రవారం నాడు కూడా ఇదే ప్రాంతలో రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఇక గతకొద్ది రోజుల్లో త్రిపుర, మిజోరాం, జమ్ముకశ్మీర్‌, లదాఖ్‌ రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి.