నేటితో ముగియనున్న తెలంగాణ ఎంసెట్
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. ఆన్లైన్ ప్రశ్నపత్రాలతో పాటు… ప్రాథమిక సమాధానాలను ఈనెల 11న విద్యార్థులకు మెయిల్ ద్వారా పంపిచాలని అధికారులు నిర్ణయించారు. ఎంసెట్ పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించినందున,,, సమాధానాలను విశ్లేషించుకోవడానికి విద్యార్ధులకు మెయిల్ ద్వారా పంపించనున్నారు. వాటికి సంబంధించిన ప్రాథమిక “కీ” కూడా అదే రోజు పంపిస్తారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది “కీ” ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, […]
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. ఆన్లైన్ ప్రశ్నపత్రాలతో పాటు… ప్రాథమిక సమాధానాలను ఈనెల 11న విద్యార్థులకు మెయిల్ ద్వారా పంపిచాలని అధికారులు నిర్ణయించారు. ఎంసెట్ పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించినందున,,, సమాధానాలను విశ్లేషించుకోవడానికి విద్యార్ధులకు మెయిల్ ద్వారా పంపించనున్నారు. వాటికి సంబంధించిన ప్రాథమిక “కీ” కూడా అదే రోజు పంపిస్తారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది “కీ” ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, నిన్న ఫార్మా, అగ్రికల్చర్ ఆన్లైన్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం ఫార్మా, వ్యవసాయ పరీక్షతో ఎంసెట్ ముగియనుంది. ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 31 వేల మంది విద్యార్థులు హాజరు కాగా… నిన్నటి ఫార్మా, వ్యవసాయ ప్రవేశ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 45,660 మంది విద్యార్థులు రాశారు.