Myntra to Change Logo : మహిళ ఇచ్చిన షాక్‌తో లోగోనే మార్చేసుకున్న ఈ-కామర్స్ దిగ్గజం

ఈ-కామర్స్ దిగ్గజం మింత్రా తన లోగోను మార్చుకుంది. ఆ సంస్థ లోగో మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబైలో కేసు నమోదైన నేపథ్యంలో...

Myntra to Change Logo : మహిళ ఇచ్చిన షాక్‌తో లోగోనే మార్చేసుకున్న ఈ-కామర్స్ దిగ్గజం
Follow us

|

Updated on: Feb 03, 2021 | 5:31 PM

Myntra to Change Logo :  ఈ-కామర్స్ దిగ్గజం మింత్రా తన లోగోను మార్చేసుకుంది. ఆ సంస్థ లోగో మహిళలను కించపరిచేలా ఉందంటూ ముంబైలో కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అవెస్తా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నాజ్ పటేల్ గతేడాది డిసెంబరులో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు మింత్రా లోగోపై ఫిర్యాదు చేశారు.

అది అభ్యంతరకరంగా ఉందని, మహిళలను అవమానపరిచేలా ఉందని ఆరోపించారు. వెంటనే దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ స్వచ్ఛంద సంస్థ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు.

పటేల్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మింత్రా లోగో మహిళలను కించపరిచేలా ఉందని నిర్ధారించారు. దీంతో తమను కలవాలంటూ మింత్రా అధికారులకు నోటీసులు పంపారు. నెలలోపే లోగోను మార్చేస్తామని వారు తమకు హామీ ఇచ్చారని ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండికార్ తెలిపారు. కొత్త లోగోను కూడా రివిల్ చేసింది. మింత్రా తన లోగోలో కొన్ని మార్పులు చేసింది.

సమస్యకు సంబంధించిన అన్ని వివాదాల తరువాత, ఆన్‌లైన్ షాపింగ్ అనువర్తనం వారి వెబ్‌సైట్, వారి అనువర్తనం మరియు ప్యాకేజింగ్ మెటీరియల్‌పై లోగోను మార్చాలని నిర్ణయించుకుంది. కొత్త లోగోతో ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మింత్రా ఇప్పటికే ప్రింటింగ్ ఆర్డర్లు జారీ చేసింది.

భారతదేశంలో బట్టలు మరియు ఉపకరణాల కోసం అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్లలో మింత్రా ఒకటి. 2020 లో వెబ్‌సైట్ ట్రాఫిక్‌లో 51 శాతం పెరుగుదలను నమోదు చేసినందున వార్షిక శీతాకాలపు అమ్మకం మింత్రాకు భారీగా నిరూపించుకుంది.

వెబ్‌సైట్, యాప్‌లో తమ లోగోను మార్చివేస్తున్నట్టు మింత్రా తాజాగా ప్రకటించింది. అలాగే, ప్యాకేజింగ్ మెటీరియల్‌పైనా లోగోను మారుస్తున్నట్టు తెలిపింది. కొత్త లోగోతో ఇప్పటికే ప్యాకేజింగ్ మెటీరియల్‌కు ఆర్డర్ ఇచ్చినట్టు వివరించింది.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..