మద్యం మత్తులో యువకుల వీరంగం..!
ఇబ్రహీపట్నంలో మద్యం మత్తులో కొందరు యువకులు వీరం గం సృష్టించారు. మత్తులో కారును స్పీడ్ గా డ్రైవ్ చేసి ఇద్దరిని గాయాపరిచారు. కూకట్ పల్లికి చెందిన సాయి, వినీత్లు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి కల్లు తాగేందుకు కారులో వెళ్లినట్లు సమాచారం. అతిగా మద్యం సేవించి మత్తులో కారును నడుపుతూ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఇద్దరిని ఢీ కొట్టారు. అనంతరం భయంతో కారు స్పీడ్ పెంచి అక్కడే నిలిపిన రెండు బైకులు, గోడను ఢీ కొట్టి ఆగిపోయారు. […]
ఇబ్రహీపట్నంలో మద్యం మత్తులో కొందరు యువకులు వీరం గం సృష్టించారు. మత్తులో కారును స్పీడ్ గా డ్రైవ్ చేసి ఇద్దరిని గాయాపరిచారు. కూకట్ పల్లికి చెందిన సాయి, వినీత్లు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి కల్లు తాగేందుకు కారులో వెళ్లినట్లు సమాచారం. అతిగా మద్యం సేవించి మత్తులో కారును నడుపుతూ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఇద్దరిని ఢీ కొట్టారు. అనంతరం భయంతో కారు స్పీడ్ పెంచి అక్కడే నిలిపిన రెండు బైకులు, గోడను ఢీ కొట్టి ఆగిపోయారు. రాయపోల్ నుంచి కారును వెంబడించిన గ్రామస్థులు ఆ ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తరువాత వారి కారును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకులను, కారును ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ వివరించారు.