బాలీవుడ్కు, డ్రగ్స్కు ఎలాంటి లింక్ లేదు: కేంద్రం
బాలీవుడ్లో డ్రగ్స్ వివాదంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. బాలీవుడ్కు, డ్రగ్స్కు ఎలాంటి లింక్ లేదని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో బీ-టౌన్కు డ్రగ్స్ లింక్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని కేంద్రం స్పష్టం చేసింది.
Bollywood Drugs Case: బాలీవుడ్లో డ్రగ్స్ వివాదంపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. బాలీవుడ్కు, డ్రగ్స్కు ఎలాంటి లింక్ లేదని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో బీ-టౌన్కు డ్రగ్స్ లింక్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ మూలాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరిండా, దిపేష్ సావంత్, డ్రగ్ డీలర్ కైజన్ను ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అటు హీరోయిన్ కంగనా రనౌత్ కూడా డ్రగ్స్ కేసుపై పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన విషయం విదితమే. దేశమంతా తీవ్రంగా ఈ కేసు గురించి చర్చించుకుంటున్న సమయంలో కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
బిగ్ బాస్ 4: ఈ సీజన్లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
‘కరోనా వైరస్ను ల్యాబ్లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’