మసాజ్ పార్లర్ పేరుతో సైంటిస్ట్ హనీట్రాప్.. ఛేదించిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో మరో హనీట్రాప్ భాగోతం బయటకు వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జూనియర్ శాస్త్రవేత్త(45) హనీట్రాప్కు గురయ్యాడు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో హనీట్రాప్ భాగోతం బయటకు వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జూనియర్ శాస్త్రవేత్త(45) హనీట్రాప్కు గురయ్యాడు. మసాజ్ పేరుతో మాయమాటలు చెప్పి హోటల్ కు రప్పించింది. హోటల్ గదిలో అతన్ని బంధించి డబ్బులు డిమాండ్ చేసింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ ముఠాను అరెస్ట్ చేసి యంగ్ సైంటిస్టుకు విముక్తి కలింగించారు నోయిడా పోలీసులు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నోయిడా సెక్టార్ 77లో నివసిస్తున్న సైంటిస్ట్ ఆన్లైన్ లో మసాజ్ పార్లర్ కోసం వెతికాడు. ఇదే క్రమంలో అతను ఒక వ్యక్తితో కనెక్ట్ అయ్యాడు. శనివారం సాయంత్రం నోయిడా సిటీ సెంటర్లో తనను కలవమని చెప్పడంతో అతన్ని కలిసేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే తన భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనేందుకు నోయిడా సిటీ సెంటర్కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు.
అర్థరాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఆ తర్వాత కిడ్నాపర్ల నుంచి ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె భర్తను సురక్షితంగా విడుదల చేయాలంటే రూ.10 లక్షలు డిమాండ్ చేస్తూ ఫోన్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిడ్నాప్ డ్రామాను ఛేదించారు. గంటల వ్యవధిలోనే సైంటిస్ట్ను సురక్షితంగా రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సెక్టార్ 41లోని ఓయో హోటల్లో అతన్ని బందీగా ఉంచినట్లు గుర్తించారు. కిడ్నాప్కు సంబంధించి ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ కుమార్, సునీతా గుర్జార్, రాకేశ్ కుమార్ అలియాస్ రింకు అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా కిడ్నాప్లో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.