జనవరి ఒకటి నుంచి ఏపీలో ఇంటింటికీ రేషన్.. జైపూర్ నుంచి గూడ్స్ రైలు ద్వారా గుంటూరు వచ్చిన మినీ వ్యాన్లు
ఆంధ్రప్రదేశ్ లో జనవరి ఒకటోతేదీ నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. కొత్త సంవత్సరం నుంచి సరికొత్తగా రేషన్..
ఆంధ్రప్రదేశ్ లో జనవరి ఒకటోతేదీ నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. కొత్త సంవత్సరం నుంచి సరికొత్తగా రేషన్ సరకులను మినీ వ్యాన్ ద్వారా లబ్ధిదారుల ఇంటి ముంగిటకే సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికోసం అవసరమైన మినీ వ్యాన్లను సర్కారు సిద్ధం చేస్తోంది. వ్యాన్లు తోలేందుకు డ్రైవర్లను కూడా త్వరలో నియామకం చేయనుంది. ఇందులోభాగంగా గుంటూరు జిల్లాకు తొలి విడతగా 120 మినీ వ్యాన్లు జైపూర్ నుంచి గూడ్స్ రైలు ద్వారా న్యూగుంటూరు రైల్వేస్టేషన్కు చేరుకున్నాయి. అంతేకాదు, ఇందుకు అవసరమైన మినీ ట్రక్కులను అన్ని వర్గాల యువతకు మంజూరు చేసి ఉపాధి కల్పించాలని కూడా జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ ట్రక్కులను రాయితీపై అందజేయనుంది. ఒక్క గుంటూరు జిల్లాలో 817 మినీ ట్రక్కులు అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు.