అక్కడ మొబైల్ ఛార్జింగ్ చేస్తే.. బ్యాంక్ ఖాతా లూటీ!
ఈ స్మార్ట్ యుగంలో.. యువతకు చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు తాము చేస్తున్న కార్యకలాపాలన్నీ సోషల్ మీడియాలో పొందుపరుస్తుండటం వారికి అలవాటుగా మారింది. ఇక ఫోన్ ద్వారా విలువైన సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా మనీ ట్రాన్స్ఫర్ వంటి లావాదేవీలను కూడా చేస్తుంటారు. ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సాకెట్లు దర్శమిస్తున్నాయి. ఛార్జింగ్ అయిపోయింది కదా అని.. ఆ […]
ఈ స్మార్ట్ యుగంలో.. యువతకు చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు తాము చేస్తున్న కార్యకలాపాలన్నీ సోషల్ మీడియాలో పొందుపరుస్తుండటం వారికి అలవాటుగా మారింది. ఇక ఫోన్ ద్వారా విలువైన సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా మనీ ట్రాన్స్ఫర్ వంటి లావాదేవీలను కూడా చేస్తుంటారు. ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సాకెట్లు దర్శమిస్తున్నాయి. ఛార్జింగ్ అయిపోయింది కదా అని.. ఆ సాకెట్స్లో ఛార్జింగ్ పెడితే బ్యాంక్ ఖాతా గుల్లవుతుందని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే, ఇలాంటి సాకెట్స్ దగ్గర హ్యాకర్లు ‘ఆటో డేటా ట్రాన్స్ఫర్ డివైజ్’లను అమర్చుతారట. ఆ డివైజుల ద్వారా వాళ్ళు ఫోన్ డేటాను చోరీ చేసి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును లూటీ చేసే ఛాన్సులు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కూడా తమ ఖాతాదారులకు ఈ విషయంపై ఇప్పటికే తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా హెచ్చరించింది. ఇక ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు మీ స్మార్ట్ ఫోన్లను ఎలక్ట్రికల్ సాకెట్స్ వద్ద ఛార్జ్ చేసుకోవాలని.. అదీ కూడా సొంత కేబుల్ లేదా చార్జర్ ఉపయోగించడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు. కాబట్టి బయట ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించడం మంచిది.
Think twice before you plug in your phone at charging stations. Malware could find a way in and infect your phone, giving hackers a way to steal your passwords and export your data.#SBI #Malware #CyberAttack #CustomerAwareness #Cybercrime #SafeBanking #JuiceJacking pic.twitter.com/xzSMNNNv4U
— State Bank of India (@TheOfficialSBI) December 7, 2019