ఆల్ టైం రికార్డు స్థాయికి పసిడి ధర
పసిడి పరుగులు పెడుతూనే ఉంది. రోజు రోజుకి రికార్డు స్థాయికి చేరుకుంటుంది. బంగారం, వెండి ధరలు గురువారం ఆల్ టైం హైక్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లోనూ యల్లోమెటల్ ధర ఎగిసింది. గురువారం ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం ధర అమాంతం 765 రూపాయలు భారమై తొలిసారిగా 55,863 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి ఏకంగా 4,074 రూపాయలు పెరిగి 75,967 రూపాయలకు ఎగబాకింది.
పసిడి పరుగులు పెడుతూనే ఉంది. రోజు రోజుకి రికార్డు స్థాయికి చేరుకుంటుంది. బంగారం, వెండి ధరలు గురువారం ఆల్ టైం హైక్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లోనూ యల్లోమెటల్ ధర ఎగిసింది. గురువారం ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం ధర అమాంతం 765 రూపాయలు భారమై తొలిసారిగా 55,863 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి ఏకంగా 4,074 రూపాయలు పెరిగి 75,967 రూపాయలకు ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై పెనుప్రభావం చూపుతుందనే అంచనాల నడుమ మదుపుదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధలకు రెక్కలు వస్తున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఏకంగా 2055 డాలర్ల ఆల్టైం హైకి చేరింది. అంతర్జాతీయం అమెరికన్ డాలర్ కూడా బలహీనపడటం, మదుపరులు పెట్టుబడులు షేర్ మార్కెట్ కంటే బులియన్ మార్కెట్ సేఫ్ గా భావించడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. అటు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికన్ డాలర్ పుంజుకుంటే బంగారం ధరల్లో కొంత తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందన్న అశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.