కేరళలో మరో దారుణం..కుక్క నోటికి ప్లాస్టర్..నీళ్లు కూడా లేకుండా ఇలా..
కేరళలో జరిగిన దారుణ సంఘటన గర్భిణీ ఏనుగు మరణం మరువకముందే..మొన్న హిమాచల్ ప్రదేశ్లో ఓ ఆవు నోట్లో బాంబ్ పేలింది. తాజాగా మరో మూగజీవిని చిత్రహింసలు పెట్టిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది.
కేరళలో జరిగిన దారుణ సంఘటన గర్భిణీ ఏనుగు మరణం మరువకముందే..మొన్న హిమాచల్ ప్రదేశ్లో ఓ ఆవు నోట్లో బాంబ్ పేలింది. తాజాగా మరో మూగజీవిని చిత్రహింసలు పెట్టిన సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
సుమారు 3 ఏళ్ల వయసున్న కుక్క ఆహారం తీసుకునే వీలు లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు నోటికి ప్లాస్టర్ చుట్టి వదిలేశారు. దీంతో దాదాపు రెండు వారాలుగా ఆ కుక్క నీరు, ఆహారం లేకుండా నీరసించిపోయింది. ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. త్రిశూర్ లోని ఒల్లూర్ జంక్షన్ వద్ద ఓ వ్యక్తి కుక్క పరిస్థితిని గమనించి పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ సర్వీస్ సంస్థకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో యానిమల్ వెల్ఫేర్ సభ్యులు కుక్కను కాపాడారు. గుర్తు తెలియని దుర్మర్గులు పెంపుడు కుక్క నోటి చుట్టూ టేప్ బిగించారని దీంతో..కుక్క మూతికి బాగా గాయమైనట్లు చెప్పారు. వైద్యుల సంరక్షలో టేప్ ను తొలగించి దానికి వైద్యం అందించారు. కుక్కను హింసించిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.