డాక్టర్ సుధాకర్‌కి చికిత్స అందించే‌ వైద్యుడి మార్పు..!

డాక్టర్ సుధాకర్‌కి చికిత్స అందించే వైద్యుడిని అధికారులు మార్చారు. ఇంతవరకు సుధాకర్‌కి డాక్టర్ రామిరెడ్డి చికిత్స అందిస్తుండగా.. ఆయన స్థానంలో మాధవి లత అనే

డాక్టర్ సుధాకర్‌కి చికిత్స అందించే‌ వైద్యుడి మార్పు..!
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 12:38 PM

డాక్టర్ సుధాకర్‌కి చికిత్స అందించే వైద్యుడిని అధికారులు మార్చారు. ఇంతవరకు సుధాకర్‌కి డాక్టర్ రామిరెడ్డి చికిత్స అందిస్తుండగా.. ఆయన స్థానంలో మాధవి లత అనే మహిళా డాక్టర్‌కి బాధ్యతలు అప్పగించారు. అయితే తనకు అందిస్తున్న చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ సుధాకర్ మెంటల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కి లేఖ రాసిన విషయం తెలిసిందే. తనకు ఇస్తోన్న మందులను ఉపయోగిస్తే  పిచ్చివాడిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై హైకోర్టులోనూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఆయనకు చికిత్స అందించే వైద్యుడిని మార్చారు.

మరోవైపు డాక్టర్ సుధాకర్ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ.. విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద విశాఖపట్నంలో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. కాగా ఏపీ ప్రభుత్వంపై సుధాకర్ తప్పుడు ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాటిపైన విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 16న ఆయన రోడ్డుపై మద్యం తాగి హల్‌చల్ చేశారు. దీంతో సుధాకర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సుధాకర్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

Read This Story Also:  విజయవాడలో విద్యార్థుల మధ్య గొడవ.. రాళ్లు, కత్తులతో..!