హైదరాబాద్ నిమ్స్లో ఉద్రిక్తత.. డాక్టర్పై దాడి..
హైదరాబాద్లోని నిమ్స్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారికి తక్షణ వైద్యం అందించలేదని బాధితుల బంధువులు దాడికి దిగారు. వైద్యులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. నిమ్స్ ఎమర్జన్సీ వార్డులో యువకులు వైద్యులను తిడుతూ, వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వైద్యులపై దాడి ఘటనను నిమ్స్ సిబ్బంది ఖండించారు. తమకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాగా.. డాక్టర్లపై దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేశామని వెస్ట్ జోన్ […]
హైదరాబాద్లోని నిమ్స్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారికి తక్షణ వైద్యం అందించలేదని బాధితుల బంధువులు దాడికి దిగారు. వైద్యులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. నిమ్స్ ఎమర్జన్సీ వార్డులో యువకులు వైద్యులను తిడుతూ, వారిపై దాడి చేశారు.
ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వైద్యులపై దాడి ఘటనను నిమ్స్ సిబ్బంది ఖండించారు. తమకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాగా.. డాక్టర్లపై దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేశామని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. దాడికి పాల్పడ్డ వారంతా మద్యం సేవించి ఉన్నారని డీసీపీ చెప్పారు.
ట్రీట్మెంట్కు రెడీ అవుతున్న సమయంలో తనపై దాడికి పాల్పడ్డారని నిమ్స్ డాక్టర్ అన్వేష్ ఆరోపించారు. కొందరు ఒక వ్యక్తిని తీసుకువచ్చి యాక్సిడెంట్ అయిందని వైద్యం చేయాలని వచ్చారని.. గాయపడిన వ్యక్తితో పాటు మిగిలిన వ్యక్తులు కూడా మద్యం సేవించి ఉన్నట్టు గుర్తించామని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనతో రోగులు కూడా తీవ్ర ఆందోళన చెందారు.