మాటల్లో కాదు.. మనం చేయాల్సింది చాలా ఉంది
షాద్నగర్లో యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అంతేకాదు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అటు తమిళనాడు.. ఉత్తరాదిన జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. అమ్మాయిలపై రెచ్చిపోయిన మానవ మృగాలు.. వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో అందరిలో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులను ఉరి తీయాలని అందరి వద్ద నుంచి డిమాండ్ […]
షాద్నగర్లో యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అంతేకాదు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అటు తమిళనాడు.. ఉత్తరాదిన జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. అమ్మాయిలపై రెచ్చిపోయిన మానవ మృగాలు.. వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో అందరిలో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులను ఉరి తీయాలని అందరి వద్ద నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఇక శంషాబాద్ హత్య కేసు నిందితులను నిందితులను తమకు అప్పగించాలని.. వాళ్లకు తామే సరైన శిక్ష వేస్తామని వేల మంది ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ దారుణాలపై స్పందించారు. హైదరాబాద్లో యువ వైద్యురాలు, షంబాల్లో టీనేజీ అమ్మాయిపై హత్యాచారం ఘటన నన్ను చాలా బాధించాయి. ఈ హేయమైన చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో ఉన్న మనం మాటల మాట్లాడటం కంటే చేయాల్సింది చాలా ఉంది. మన మైండ్సెట్ మారాలి. హింస వైపు వెళ్లకూడదు. మహిళలపై జరుగుతోన్న వేధింపులు ఆగాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు.
I have been so deeply disturbed by the savage rape and murder of the young veterinarian in Hyderabad and the teenage girl in Sambhal that no words are enough to express my outrage.
As a society, we have to do far more than just speak up when these horrific incidents take place.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 30, 2019