దివ్య తేజస్విని హత్య దర్యాప్తు ముమ్మరం..నాగేంద్ర తరపున ఏడుగురు అదుపులోకి

విజయవాడలో నాగేంద్రబాబు అనే ఉన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నాగేంద్ర తరపున ఏడుగురుని పోలీసులు ఇప్పటివరకూ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు, సెల్ఫీ వీడియో, కాల్ డేటా ఆధారాలతో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. భీమవరంలో దివ్య చదినవిన ఇంజినీరింగ్ కాలేజికి వెళ్లిన పోలీసులు..దివ్య స్నేహితుల నుంచి కీలక ఆధారాలు సేకరించారు. పెళ్లి జరిగినట్టున్న ఫోటో ఆధారంగా తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో పోలీసు బృందాలు విచారణ […]

దివ్య తేజస్విని హత్య దర్యాప్తు ముమ్మరం..నాగేంద్ర తరపున ఏడుగురు అదుపులోకి
Follow us

|

Updated on: Oct 19, 2020 | 7:16 AM

విజయవాడలో నాగేంద్రబాబు అనే ఉన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య తేజస్విని హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నాగేంద్ర తరపున ఏడుగురుని పోలీసులు ఇప్పటివరకూ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులు, సెల్ఫీ వీడియో, కాల్ డేటా ఆధారాలతో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. భీమవరంలో దివ్య చదినవిన ఇంజినీరింగ్ కాలేజికి వెళ్లిన పోలీసులు..దివ్య స్నేహితుల నుంచి కీలక ఆధారాలు సేకరించారు. పెళ్లి జరిగినట్టున్న ఫోటో ఆధారంగా తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో పోలీసు బృందాలు విచారణ చేపట్టాయి. హత్యకు ముందు దివ్య, నాగేంద్రల మధ్యన సాగిన ఫోన్ రికార్డులను విజయవాడ పోలీసులు హైదరాబాద్ పంపించారు. నాగేంద్రకు ఎవరైనా సహాయ పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. దివ్యపై దాడి అనంతరం తనను తాను గాయపర్చుకున్న నిందితుడు నాగేంద్రకు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.