దిశ: నిందితుల ఎన్కౌంటర్తో పబ్లిక్ ఫుల్ హ్యాపీ.. పోలీసులపై పువ్వులు..!
దిశ హత్యాచారం కేసులో.. నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా.. పోలీసులపై నిందితులు రాళ్లు వేసి దాడి చేసిన క్రమంలో.. వారు ఎన్కౌంటర్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. కాగా.. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి పెద్ద ఎత్తున పబ్లిక్ […]
దిశ హత్యాచారం కేసులో.. నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా.. పోలీసులపై నిందితులు రాళ్లు వేసి దాడి చేసిన క్రమంలో.. వారు ఎన్కౌంటర్ చేసినట్టు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేశారు.
కాగా.. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి పెద్ద ఎత్తున పబ్లిక్ చేరుకుంటున్నారు. దిశపై అత్యంత పాశవికంగా.. అత్యాచారం చేసి.. హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో.. వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. పోలీసులపై పువ్వులు జల్లుతూ.. కేరింతలు కొడుతున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందని.. జై పోలీస్.. జై పోలీస్.. అంటూ పబ్లిక్ నినాదాలు చేస్తున్నారు.