‘దిశ’ కేసు: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్టాలు సవరించాలంటూ ఓ వైపు కొందరు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు మాత్రం కొందరు మృగాలు మహిళలపై తమ చర్యలతో పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లచ్చని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మెట్రో భద్రతా దళాలకు కూడా సూచనలిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా […]
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్టాలు సవరించాలంటూ ఓ వైపు కొందరు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు మాత్రం కొందరు మృగాలు మహిళలపై తమ చర్యలతో పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లచ్చని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మెట్రో భద్రతా దళాలకు కూడా సూచనలిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా దిశ ఘటన నేపథ్యంలో పెప్పర్ స్ప్రేకి అనుమతినిస్తూ బెంగళూరు మెట్రో మంగళవారం నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా అదే డిసిషన్ తీసుకుంది.