మహిళలపై దాడులు.. బెంగళూరు మెట్రో సంచలన నిర్ణయం
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్టాలు సవరించాలంటూ ఓ వైపు కొందరు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు మాత్రం కొందరు మృగాలు మహిళలపై తమ చర్యలతో పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లచ్చని ఆదేశాలు జారీచేసింది. పెప్పర్ స్ర్పేలకు త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో ఇప్పటి వరకు అక్కడి మెట్రోలో వాటిని అనుమతించేవారు […]
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు చట్టాలు సవరించాలంటూ ఓ వైపు కొందరు ఆందోళన చేస్తుంటే.. మరోవైపు మాత్రం కొందరు మృగాలు మహిళలపై తమ చర్యలతో పేట్రేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది.
మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లచ్చని ఆదేశాలు జారీచేసింది. పెప్పర్ స్ర్పేలకు త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో ఇప్పటి వరకు అక్కడి మెట్రోలో వాటిని అనుమతించేవారు కాదు. ప్రయాణికుల వద్ద పెప్పర్ స్ప్రేలు దొరికితే వాటిని సీజ్ చేసేవారు. దీనిపై గతంలో పలు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఇటీవల దిశ హత్యాచారం నేపథ్యంలో మహిళల భద్రత దృష్ట్యా మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలకు అనుమతిని ఇచ్చారు.