ఆర్జీవీ ‘దిశ’కు మరో ఎదురుదెబ్బ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం దిశ. ఈ మూవీపై దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యుడిషియల్‌ కమిషన్‌ని ఆశ్రయించారు.

ఆర్జీవీ 'దిశ'కు మరో ఎదురుదెబ్బ
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2020 | 2:17 PM

RGV Disha Movie: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం దిశ. ఈ మూవీపై దిశ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు జ్యుడిషియల్‌ కమిషన్‌ని ఆశ్రయించారు. దిశ ఎన్‌కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని దిశ నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టుకు చేరుకున్నారు. ( నాపై ప్రభాస్‌కి క్రష్‌ ఉండేదట: భాగ్యశ్రీ)

ఈ చిత్రంలో తమ వాళ్లను విలన్లుగా పెట్టి చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని నిందితుల కుటుంబాలు వెల్లడించాయి. ఈ చిత్రం తీయడం వలన కుటుంబ సభ్యుల జీవించే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెరుగుతున్న పిల్లల మీద ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వారిపై చిత్రం తీసి ఇంకా చంపుతున్నారని కుటుంబ సభ్యులు కమిషన్‌కి తెలిపారు. (యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా సంతోషి నియామకం)

సుప్రీంకోర్టు నియమించిన కమిషన్‌కి విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని, వెంటనే రామ్ గోపాల్ తీస్తున్న చిత్రాన్ని నిలిపి వెయ్యాలని వారు కోరారు. కాగా ఈ ఘటనపై ఇప్పటికే దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని.. దిశను నిలిపివేసేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ( క్వారంటైన్‌లోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్)