నేటి శాసనసభలో.. పలు కీలక అంశాలపై చర్చ
అధికార, విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు గత వారం రోజులుగా వాడీవేడీగా జరుగుతున్నాయి. ఈ రోజు జరిగే శాసనసభ ముందుకు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. 104, 108 సర్వీసుల పనితీరు… రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులో ఆలస్యంపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. గ్రామీణ గృహ నిర్మాణం లబ్ధిదారులకు చెల్లింపుల నిలిపివేత, అఖండ గోదావరి ప్రాజెక్టుపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు. ఇక […]
అధికార, విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు గత వారం రోజులుగా వాడీవేడీగా జరుగుతున్నాయి. ఈ రోజు జరిగే శాసనసభ ముందుకు పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. 104, 108 సర్వీసుల పనితీరు… రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులో ఆలస్యంపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. గ్రామీణ గృహ నిర్మాణం లబ్ధిదారులకు చెల్లింపుల నిలిపివేత, అఖండ గోదావరి ప్రాజెక్టుపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు. ఇక రేషన్ డీలర్ల తొలగింపుపై జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ ప్రశ్నించనున్నారు. మరోవైపు.. పీఏసీ కమిటీ , బడ్జెట్ ఎస్టిమేషన్స్ కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీలకు సంబంధించి వైసీపీ సభ్యులను సీఎం జగన్ ఈ రోజే ప్రకటించనున్నారు.