శ్రీవారి సేవలో త్రివిక్రముడు
తిరుమల:తిరుమల శ్రీవారిని మాటల మాంత్రికుడు, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు త్రివిక్రమ్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వసంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు.
తిరుమల:తిరుమల శ్రీవారిని మాటల మాంత్రికుడు, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు త్రివిక్రమ్ కు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వసంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు.