పెళ్లి పీటలెక్కనున్న ‘సాహో’ డైరెక్టర్..అమ్మాయి ఎవరో తెలుసా..?
లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి.ఇటీవలే ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ ఆచంట మహేష్ పెళ్లి చేసుకోగా.. తాజాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నారు .
లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు..భాగస్వాములను జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ ఆచంట మహేష్ పెళ్లి చేసుకోగా.. తాజాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నారు .
గత కొంతకాలంగా ఈ యంగ్ డైరెక్టర్ ప్రవల్లిక అనే అమ్మాయితో లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వారి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో ఇద్దరూ కలిసి ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే జూన్ 10వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో సుజీత్ ఎంగేజ్మెంట్ చేసుకోనున్నట్లు సమాచారం. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి డాక్టర్ అని తెలుస్తోంది. కాగా ‘రన్ రాజా రన్’తో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు సుజీత్.. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో ‘సాహో’ మూవీ తెరకెక్కించారు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కించబోతున్నాడు సుజీత్.