దర్శకేంద్రుడు గొంతు విప్పారు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గొంతు విప్పారు. తానో కొత్త చిత్రాన్ని తీయబోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఎన్ఠీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. నా 50 ఏళ్ళ సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనని, ఇది గత జన్మల సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందని, తన కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకమని పేర్కొన్నారు. […]
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గొంతు విప్పారు. తానో కొత్త చిత్రాన్ని తీయబోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఎన్ఠీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. నా 50 ఏళ్ళ సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనని, ఇది గత జన్మల సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందని, తన కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకమని పేర్కొన్నారు. . మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నా.. పూర్తి వివరాలు త్వరలో అని రాఘవేంద్ర రావు అన్నారు. ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా ఉంటుందని అంటూ ఆయన.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రంలో హీరోలెవరన్న విషయాన్ని ఆయన సస్పెన్స్ లో పెట్టేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆయన టీడీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో. #JoharNTR pic.twitter.com/pJoD8vSFYD
— Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2019