కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయాలు తీసుకున్న దిల్ రాజు..!
అనుకోకుండా వచ్చిన మహమ్మారి కరోనా ప్రభావం సినీ రంగంపై కూడా చాలానే పడింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి సినిమా వారికి చాలా సమయమే పట్టనందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
అనుకోకుండా వచ్చిన మహమ్మారి కరోనా ప్రభావం సినీ రంగంపై కూడా చాలానే పడింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి సినిమా వారికి చాలా సమయమే పట్టనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొద్ది నెలల పాటు సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనకూడదని దిల్ రాజు నిర్ణయించుకున్నారట. తాను నిర్మించిన సినిమాలను కూడా తన సొంత బ్యానర్పై లాభాల్లో వాటా ప్రకారంగా విడుదల చేయాలనుకుంటున్నారట.
అంతేకాదు రాబోతున్న పెద్ద సినిమాలకు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్(తిరిగి చెల్లించని అడ్వాన్స్) ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారట. అయితే ఈ విషయం తెలిసిన మిగిలిన నిర్మాతలు కూడా అదే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ ఇవ్వకపోవడం వలన భారీ బడ్జెట్ చిత్రాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కరోనా ప్రభావం నేపథ్యంలో సినీ పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. ఇప్పటికే పలువురు నిర్మాతలు సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.
Read This Story Also: చిన్న పదం.. సొంత పార్టీ నేతపై వైసీపీ ఫ్యాన్స్ ఫైర్..!