Ramateertham : రామతీర్థం ఘటనపై ఆరు పోలీసు బృందాలు పని చేస్తున్నాయి: డీఐజీ రంగారావు
పశ్చిమబెంగాల్ రాజకీయ వేడిరాజుకుంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నేతలు ఒకరి పై ఒకరు మాటలతోనే కాదు ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారు.
Ramateertham : రామతీర్థం ఘటనపై ఆరు పోలీసు బృందాలు పని చేస్తున్నాయని, ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నామని డీఐజీ రంగారావు తెలిపారు. కొంత మంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. సంతబొమ్మాలి పాలేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని రోడ్డు జంక్షన్ మధ్య ఏర్పాటు చేయడంపై సమాజంలో అసమానతలు పెంచడానికి ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీఐజీ వెల్లడించారు. వీరిలో నలుగురికి ఓ రాజకీయ పార్టీతో సంబంధం ఉందని డీఐజీ రంగారావు పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
ఆసుపత్రిలో చేరిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే.. అసలు కారణం ఏంటంటే ?