హుజూర్ నగర్ పరాభవం.. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా.?
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీసింది. హుజూర్ నగర్లో అభ్యర్థి ఎంపికపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా పీసీసీ చీఫ్ పట్టుబట్టి మరీ తన సతీమణి పద్మావతినే బరిలోకి దింపారు. మొన్నటి వరకు హుజూర్నగర్ ఉత్తమ్ సొంత నియోజకవర్గం.. ఇంకేముంది ! గెలుపు తథ్యం అనుకున్నారు. కానీ అంతా రివర్సైంది. హుజూర్నగర్ వాసులు గులాబీ పార్టీకి జీ హుజూర్ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకే కాదు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్కు కూడా ఇది […]
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీసింది. హుజూర్ నగర్లో అభ్యర్థి ఎంపికపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా పీసీసీ చీఫ్ పట్టుబట్టి మరీ తన సతీమణి పద్మావతినే బరిలోకి దింపారు. మొన్నటి వరకు హుజూర్నగర్ ఉత్తమ్ సొంత నియోజకవర్గం.. ఇంకేముంది ! గెలుపు తథ్యం అనుకున్నారు. కానీ అంతా రివర్సైంది. హుజూర్నగర్ వాసులు గులాబీ పార్టీకి జీ హుజూర్ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకే కాదు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్కు కూడా ఇది కోలుకోలేని పరాభవం అని చెప్పాలి. దీంతో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది.
పీసీసీ చీఫ్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయారు. అంతేకాక ఇప్పుడు పట్టుబట్టి మరీ సతీమణికి పార్టీ టికెట్ ఇప్పించుకునీ.. ఒకే ఒక్క హుజుర్ నగర్ సీట్ కూడా గెలవలేకపోయారు. దీంతో ఉత్తమ్ పీసీసీ పదవికి రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన ఉత్తమ్ రాజీనామా సమర్పించేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు హుజూర్నగర్ ఉప ఎన్నికల ఓటమి నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటితో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటి కూడా జరగనుంది. ఈ భేటీలో ఏఏ అంశాలపై చర్చ జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.