ప్రధాని మోదీ లేఖకు ధోనీ ట్వీట్

ప్రధాని మోదీ రాసిన లేఖకు మాజీ టీమిండియా కెప్టెన్ ధోనీ స్పందించారు. ప్రధాని తనకు రాసిన లేఖను ఆ ట్వీట్‌కు జతచేశాడు. ‘కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఎదుటివారి....

ప్రధాని మోదీ లేఖకు ధోనీ ట్వీట్
Follow us

|

Updated on: Aug 20, 2020 | 4:22 PM

ప్రధాని మోదీ రాసిన లేఖకు మాజీ టీమిండియా కెప్టెన్ ధోనీ స్పందించారు. ప్రధాని తనకు రాసిన లేఖను ఆ ట్వీట్‌కు జతచేశాడు. ‘కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఎదుటివారి అభినందన కోసమే. మేము పడిన కష్టం, చేసిన త్యాగాలను ఎదుటివారు గుర్తించారనే ఆలోచనే ఎంతో సంతోషాన్నిస్తుంది. నన్ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధాని మోదీ మీకు ధన్యవాదాలు’ అంటూ ధోనీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి  ధోనీ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ సేవలను కొనియాడుతూ ప్రధాని మోదీ అతడికి ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే ప్రధాని తన లేఖలో ధోనీని గొప్పగా కీర్తించారు. యువతకు ధోనీ ఎంతో స్పూర్తిగా నిలిచాడని, అతడో గొప్ప మార్గదర్శకుడని ప్రధాని మోదీ అభినందించారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే తత్వం ధోనీ సొంతమని, రిటైర్మెంట్ తరువాత కూడా అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిని తన లేఖలో పేర్కొన్నారు. ఉత్తమ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ధోనీకి సాటిలేరని కొనియాడారు ప్రధాని మోదీ.