ధోని రనౌట్‌తో అభిమాని మృతి..

భారత్-కివీస్ మధ్య జరిగిన సెమీస్ ఫైనల్ కోల్‌కతాలో విషాదం నింపింది. ధోనీ రనౌట్ కావడంతో తట్టుకోలేకపోయిన శ్రీకాంత్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ప్రపంచకప్‌ లీగ్ దశలో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ భారీ భాగస్వామ్యంతో జట్టులో ఆశలు రేపారు. అయితే జడేజా నిష్కమించినా ధోనీ ఉండటంతో భారత అభిమానుల్లో మళ్లీ ఆశ చిగురించింది. […]

ధోని రనౌట్‌తో అభిమాని మృతి..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 4:07 PM

భారత్-కివీస్ మధ్య జరిగిన సెమీస్ ఫైనల్ కోల్‌కతాలో విషాదం నింపింది. ధోనీ రనౌట్ కావడంతో తట్టుకోలేకపోయిన శ్రీకాంత్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ప్రపంచకప్‌ లీగ్ దశలో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమిండియా సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిపోవడాన్ని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ భారీ భాగస్వామ్యంతో జట్టులో ఆశలు రేపారు. అయితే జడేజా నిష్కమించినా ధోనీ ఉండటంతో భారత అభిమానుల్లో మళ్లీ ఆశ చిగురించింది. రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ తొలి బంతికే ధోనీ సిక్స్ కొట్టడంతో అభిమానులు మురిసిపోయారు.

అదే ఓవర్ మూడో బంతికి రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించి ధోనీ రనౌట్ కావడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటివరకు మిణుకుమిణుకుమంటూ ఉన్న ఆశలు అతడి నిష్క్రమణతో మూసుకుపోయాయి. కోల్‌కతాకు చెందిన శ్రీకాంత్ ధోనికి వీరాభిమాని. అప్పటి వరకూ మొబైల్ ఫోన్‌లో మ్యాచ్ చూస్తున్న శ్రీకాంత్ ధోని రనౌట్ కావడంతో తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?