ఓటీటీలోకి తమిళ బడా చిత్రం..!
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'జగమే తంత్రం' ఓటీటీలో విడుదలకు సిద్ధం అయిందని తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల..
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో థియేటర్లు ఓపెన్ కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ తరుణంలో చిన్న సినిమాలు అన్నీ కూడా ఓటీటీలలో విడుదలకు క్యూ కట్టగా.. తాజాగా బడా చిత్రాలు కూడా ఇదే పంథాను ఫాలో అవుతున్నాయి. దీనికి సాక్ష్యంగా తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ‘జగమే తంత్రం’ ఓటీటీలో విడుదలకు సిద్ధం అయిందని తెలుస్తోంది.
తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మొదట్లో ఓటీటీ రిలీజ్కు ధనుష్ ఒప్పుకోకపోయినా.. ఆ తర్వాత ఫైనాన్షియల్ కారణాల వల్ల ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ధనుష్ కెరీర్లో ఇది 40వ చిత్రం కాగా.. అతడికి జోడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.