లాక్డౌన్ వేళ.. ప్రయాగ్రాజ్లో భక్తుల పవిత్ర స్నానాలు..
ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో శనివారం తెల్లవారు జామునుంచి భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం చంద్రగ్రహణం రావడంతో త్రివేణీ సంగమం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో శనివారం తెల్లవారు జామునుంచి భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం చంద్రగ్రహణం రావడంతో.. ప్రయాగ్రాజ్లోని పవిత్ర త్రివేణీ సంగమం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. కొందరు శుక్రవారం రాత్రి నుంచి త్రివేణీ సంగమం వద్ద ఉంటూ.. తెల్లవారుజామున పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే ఓ వైపు లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. ఇక్కడికి మాత్రం భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రహణం వచ్చిన సమయాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు.
ప్రయాగలో గంగా, యమునా, సరస్వతి నదులు కలిసేచోటును త్రివేణీ సంగమం అంటారు. జైరామ్ అనే పూజారి మాట్లాడుతూ.. గ్రహణం తర్వాత చాలా మంది భక్తులు నదీ స్నానమాచరించారని.. కొందరు శుక్రవారం రాత్రి వచ్చి కూడా స్నానాలు చేశారని తెలిపారు. ఇక మరికొందరు భక్తులు గ్రహణం సమయంలో నదీ సమీపంలో ఉండి ఇష్టదైవాన్ని ఆరాధిస్తామని.. అందుకే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అయితే లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో.. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు హాజరవ్వడంతో పాటు.. సోషల్ డిస్టెన్స్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వస్తున్నాయి.