ఆ కొండపై నిద్రిస్తే మీకు కచ్చితంగా పిల్లలు పుడతారు..!
పెళ్లైన ప్రతి దంపతులూ తమకు పిల్లలు కావాలని కోరుకుంటారు. వివాహం అయిన కొన్ని రోజులకే బంధువులు, తెలిసినవారంతా శుభవార్త ఎప్పుడు చెబుతావంటూ అడుగుతూ ఉంటారు. దీంతో ఆ భార్యభర్తలిద్దరూ.. వారికోసమైనా వెంటనే పిల్లల్ని కనాలని చాలా తాపత్రయపడతారు. ఇక మరికొందరు దంపతులు పెళ్లయి చాలా ఏళ్లు గడుస్తున్నటికీ పిల్లలు లేకపోవడంతో, సంతానం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తారు. పిల్లల కోసం అనేక పూజలు, నోములు నోస్తారు. కొందరు మహిళలు పిల్లలు పుట్టాలని అనేక ఆచారాలు, మూఢనమ్మకాలు ఆచరిస్తుంటారు. అందులో […]
పెళ్లైన ప్రతి దంపతులూ తమకు పిల్లలు కావాలని కోరుకుంటారు. వివాహం అయిన కొన్ని రోజులకే బంధువులు, తెలిసినవారంతా శుభవార్త ఎప్పుడు చెబుతావంటూ అడుగుతూ ఉంటారు. దీంతో ఆ భార్యభర్తలిద్దరూ.. వారికోసమైనా వెంటనే పిల్లల్ని కనాలని చాలా తాపత్రయపడతారు. ఇక మరికొందరు దంపతులు పెళ్లయి చాలా ఏళ్లు గడుస్తున్నటికీ పిల్లలు లేకపోవడంతో, సంతానం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తారు. పిల్లల కోసం అనేక పూజలు, నోములు నోస్తారు. కొందరు మహిళలు పిల్లలు పుట్టాలని అనేక ఆచారాలు, మూఢనమ్మకాలు ఆచరిస్తుంటారు. అందులో భాగంగానే కొందరు దైవక్షేత్రాల్లో నిద్ర చేస్తుంటారు. అలా చేస్తే తప్పక సంతానం కలుగుతుందని వారి విశ్వాసం. అటువంటి ఆలయమే ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలోని శ్రీరామదుర్గం కొండ విశిష్టతే వేరు. త్రేతాయుగంలో దశరథ మహారాజు ఇక్కడే బస చేసి మర్నాడు పుత్రకామేష్టి యాగం తలపెట్టారట. యాగ క్రతువులో లభించిన పాయసం వలన వారికి నలుగురు కుమారులు జన్మించారని పురాణ కథనం ప్రచారంలో ఉంది.. అందుకే అప్పటి నుంచి ఈ కొండ సంతాన ప్రధాయినిగా పేరుగాంచిందని స్థానికులు చెబుతున్నారు.ప్రతీ యేటా కార్తీక పౌర్ణమి నాడు శ్రీరామదుర్గం కొండపై ఓ ఉత్సవం దర్శనమిస్తుంది. ఎటు చూసిన బారులు తీరిన భక్తులు కనిప్తారు. తమకు సంతాన భాగ్యం కలగాలని వేలాది మంది దంపతులు కొండలెక్కి, అరణ్యాల్లో నిద్రపోయేందుకు బారులు తీరి వస్తుంటారు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం కాలినడక సాగిస్తారు. కొండపై కొలువుదీరిన ధర్మలింగేశ్వరుడి ఎదుట కార్తీక పౌర్ణమి నిద్ర చేస్తారు. తొలుత మహిళలంతా నిష్టగా తలస్నానం చేసి, తడిబట్టలతోనే అక్కడి కొండపై బోర్ల పడుకుంటారు. చేతిలో కొబ్బరికాయ, అరటిపళ్లు పట్టుకుని సాష్టంగా నమస్కారం చేస్తూ నిద్రపోతారు. అప్పుడు వారికి కలలో పిల్లలు ఆడుకునే వస్తువులు కనిపిస్తే వారికి సంతానయోగం కలుగుతుందని నమ్మకం. నమ్మకమే కాదు..మేము అలాగే పుట్టామని తమ తల్లిదండ్రులు చెప్పారని బలంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అక్కడికి వచ్చిన కొందరు భక్తులు. అలా ఆ కొండకు “సంతాన కొండ’, కార్తీక పౌర్ణమికి “సంతాన పౌర్ణమి’గా చెప్పుకుంటున్నారు ఉభయ గోదావరి జిల్లా వాసులు. కాలక్రమేణ ఈ గుడి ప్రాచుర్యం పెరగడంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు సైతం సంతాన పౌర్ణమి నిద్రను బలంగా విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే, కొందరు జన విజ్ఞానవేదిక సభ్యులు మాత్రం ఇదంతా మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు.