రాష్ట్రవ్యాప్తంగా.. శ్రీవారి లడ్డూ విక్రయాలు.. పోటెత్తిన భక్తజనం..
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల
Srivari laddu prasadam: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలకు విశేష స్పందన లభిస్తోంది. మూడు రోజుల్లో 8 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అనంతపురం, కడప జిల్లాల్లో లడ్డూ విక్రయాల సంఖ్య లక్ష దాటిపోయింది. విశాఖ, కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి భారీగా లడ్డూ ప్రసాద కొనుగోళ్లు జరిగాయి.
కాగా.. లాక్డౌన్ కారణంగా రెండు నెలల నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడంతో… భక్తులకు ఎంతో ఇష్టమైన శ్రీవారి లడ్డూలను అందజేయాలని టీటీడీ భావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున లడ్డూలను తయారు చేయించి వివిధ జిల్లాలకు పంపించింది. కౌంటర్ ప్రారంభించిన గంటల్లోనే లడ్డూ విక్రయాలు పూర్తవుతున్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు టీటీడీ కళ్యాణమండపాల వద్ద లడ్డూల విక్రయం జరుగనుంది. లడ్డూ ప్రసాదం విక్రయాలకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది.