‘మోదీజీ ! మీదే భారం !’..జపాన్ షిప్ నుంచి భారత సిబ్బంది అభ్యర్థన

కరోనా భయంతో తల్లడిల్లుతున్న తమను రక్షించాలని కోరుతున్నారు జపాన్ షిప్ లోని భారతీయులు కొందరు. ‘డైమండ్ ఎక్స్ ప్రెస్’ అని వ్యవహరించే ఈ నౌక ఈ నెల 5 నుంచి జపాన్ లోని రేవులోనే ఉంది. ఇందులో 3,700 మంది ప్రయాణికులు ఉండగా.. 160 మంది భారతీయులు. వీరిలో 66 మందికి కరోనా లక్షణాలు సోకాయట. వారి టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిందని  ఈ నౌక కెప్టెన్ ప్రకటించారు. ఈ ప్రయాణికులతో బాటు సిబ్బంది కూడా రెండు […]

'మోదీజీ ! మీదే భారం !'..జపాన్ షిప్ నుంచి భారత సిబ్బంది అభ్యర్థన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 10, 2020 | 5:13 PM

కరోనా భయంతో తల్లడిల్లుతున్న తమను రక్షించాలని కోరుతున్నారు జపాన్ షిప్ లోని భారతీయులు కొందరు. ‘డైమండ్ ఎక్స్ ప్రెస్’ అని వ్యవహరించే ఈ నౌక ఈ నెల 5 నుంచి జపాన్ లోని రేవులోనే ఉంది. ఇందులో 3,700 మంది ప్రయాణికులు ఉండగా.. 160 మంది భారతీయులు. వీరిలో 66 మందికి కరోనా లక్షణాలు సోకాయట. వారి టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిందని  ఈ నౌక కెప్టెన్ ప్రకటించారు. ఈ ప్రయాణికులతో బాటు సిబ్బంది కూడా రెండు వారాలపాటు తప్పనిసరిగా నౌకలోనే దాదాపు ‘బందీలుగా’ ఉండాల్సి వస్తోంది. ఇందులోని షెఫ్ లలో నార్త్ బెంగాల్ కు చెందిన బినయ్ కుమార్ అనే షెఫ్.. తమకు సహాయం చేయాలనీ, కరోనా వైరస్ సోకినవారిని నౌక నుంచి వేరు చేయాలని ఓ వీడియో మెసేజ్ ద్వారా ప్రధాని మోదీని, ఐక్యరాజ్యసమితిని కోరారు.  తామంతా ఎంతో ఆందోళన చెందుతున్నామని ఆయన తెలిపారు. ఈ 66 మందిని మా నుంచి వేరు చేయండి.. అసలు మిగతావారినెవరిని కూడా టెస్ట్ చేయలేదు.. నాతో బాటు మరో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. మమ్మల్ని సురక్షితంగా మా ప్రాంతాలకు చేర్చేలా చూడండి అని కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఈ వీడియో ద్వారా  అభ్యర్థన చేసిన వారంతా  ముఖాలకు తెల్లని  మాస్కులు ధరించి ఉన్నారు.  ‘డైమండ్ ఎక్స్ ప్రెస్’ నౌక గత జనవరి 20 న జపాన్ లోని యోకోహామా పోర్టుకు చేరింది.    అదేనెల 25 న హాంకాంగ్ వాసి ఒకరు నౌక నుంచి దిగిపోయాడు. అయితే అతనికి కరోనా వ్యాధి ఉందని ఈ నెల 2 న ఈ నౌకలోని సిబ్బందికి సమాచారం అందింది. దాంతో నౌకలోని వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?