డేరా బాబాకు రహస్యంగా ఒక రోజు పెరోల్
తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్కు....
తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్కు అక్టోబర్ 24 న హర్యానాలోని మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం ఒక రోజు పెరోల్ మంజూరు చేసింది. గుండె జబ్బుతో బాధపడుతున్న డేరా బాబా తల్లి నసీబ్ కౌర్ (85) తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని… భార్య హర్జిత్ కౌర్ చేసిన విజ్ఞప్తిపై పెరోల్ మంజూరు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్లో ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని డేరా చీఫ్ కలిశారని అధికారులు శనివారం ధృవీకరించారు. అతన్ని గురుగ్రామ్ ఆసుపత్రికి భారీ భద్రతతో తీసుకెళ్లి సాయంత్రం జైలుకు తీసుకువచ్చినట్లు పోలీసు అధికారి తెలిపారు. 52 ఏళ్ల డేరా బాబా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని చండీగర్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోహ్తక్లోని హై-సెక్యూరిటీ సునారియా జైలులో ఉన్నారు. వివాదాస్పద బాబాకు పెరోల్ లభించి బయటకు రావడంపై మీడియాకు కూడా తెలియకుండా హర్యానా సర్కార్ జాగ్రత్తపడింది. నిబంధనల ప్రకారమే ఆయనకు పెరోల్ లభించిందని జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా పేర్కొన్నారు.
Also Read :
Flash : అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్