లక్ష కోట్లు దాటిన జన్ ధన్ ఖాతాల డిపాజిట్లు

జన్‌ ధన్ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.లక్ష కోట్లు దాటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన ఆర్థిక శాఖ.. జూలై 3 నాటికి 36కోట్ల లక్షలకు పైగా ప్రధానమంత్రి జన్‌ ధన్ యోజన ఖాతాల్లో రూ.లక్ష 400కోట్లు డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. జన్ ధన్ ఖాతాల్లో లబ్ధిదారుల డిపాజిట్లు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. జూన్ 6 నాటికి రూ.99వేల 600 కోట్ల డిపాజిట్లు ఉండగా.. జూలై 3 నాటికి […]

లక్ష కోట్లు దాటిన జన్ ధన్ ఖాతాల డిపాజిట్లు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 11, 2019 | 2:22 PM

జన్‌ ధన్ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.లక్ష కోట్లు దాటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన ఆర్థిక శాఖ.. జూలై 3 నాటికి 36కోట్ల లక్షలకు పైగా ప్రధానమంత్రి జన్‌ ధన్ యోజన ఖాతాల్లో రూ.లక్ష 400కోట్లు డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. జన్ ధన్ ఖాతాల్లో లబ్ధిదారుల డిపాజిట్లు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. జూన్ 6 నాటికి రూ.99వేల 600 కోట్ల డిపాజిట్లు ఉండగా.. జూలై 3 నాటికి లక్ష 400 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని వెల్లడించింది. కాగా దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ 2014లో జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో 50 శాతానికిపైగా మహిళలు ఉన్నారు.