అంతా ఫేక్..సీఎంకు ఎవరూ లేఖ రాయలేదు: ప్రకాశం జిల్లా జేసీ

తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వెంటనే పూర్తి వివరాలు కనుక్కుని సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. తమ కుటుంబాన్ని వెలివేశారని, బడిలో కూడా తమతో ఎవరూ […]

అంతా ఫేక్..సీఎంకు ఎవరూ లేఖ రాయలేదు: ప్రకాశం జిల్లా జేసీ
Follow us

|

Updated on: Sep 15, 2019 | 1:02 AM

తమకు సహాయం చేయాలని కోరుతూ చిన్నారి లేఖ రాసిందన్న వార్తలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వెంటనే పూర్తి వివరాలు కనుక్కుని సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ రాసినట్లు దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి.

తమ కుటుంబాన్ని వెలివేశారని, బడిలో కూడా తమతో ఎవరూ మాట్లాడటం లేదని పుష్ప లేఖలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా తమతో మాట్లాడితే రూ. 10 వేల వరకు జరిమానా వేస్తామని గ్రామ పెద్దలు ఆదేశించడంతో బడిలో ఒంటరిగా ఉండాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్నారి గురించి వచ్చిన వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి విషయం గురించి ఆరా తీశారు. వెంటనే గ్రామాన్ని సందర్శించి వివరాలు కనుక్కొని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

అధికారులు రామచంద్రాపురం గ్రామంలో పర్యటించి…గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గ్రామంలోని ప్రజలు అందరూ హాజరు అయ్యారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు గ్రామ బహిష్కరణతో పాటు.. పిల్లలను స్కూల్ కి పంపని విషయంపై విచారణ నిర్వహించారు. మెజారిటీ ప్రజలు తమ పిల్లలను స్కూల్ కి పంపుతున్నామని జాయింట్ కలెక్టర్ కి తెలిపారు. కొందరు మాత్రం మొదట రెండు రోజులు పిల్లలను స్కూల్ కి పంపని విషయం వాస్తవమేనని.. ప్రస్తుతం మాత్రం పంపిస్తున్నామని తెలిపారు. మరోవైపు.. సీఎంకు లేఖ రాసిన కుటుంబంపై వారి వ్యతిరేక వర్గం అధికారులకు ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా విచారణలో పాల్గొని గ్రామంలోని పరిస్థితిని అధికారులకు తెలిపారు. అందరినుంచి వివరాలు సేకరించిన జాయింట్ కలెక్టర్ షన్మోహన్ మీడియాతో మాట్లాడారు. గ్రామంలో ప్రధానంగా నాలుగు సమస్యలను గుర్తించాము. తీర ప్రాంతంలో గ్రామానికి చెందిన నాలుగు ఏకరాల భూమి కి సంబంధించి మాజీ ఎంపీటీసీ కోడూరి వెంకటేశ్వర్లు పట్టా పొందారు. ఆ పట్టా రద్దు చేసి గ్రామానికి అప్పగించడం జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కి కోడూరి పుష్ప రాసిన లేఖ విషయమై పూర్తిగా విచారించాము. ఆ లేఖ ఆ పాప రాయలేదని నిర్దారణ అయ్యింది. నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఈ లేఖ రాసినట్లు గ్రామస్థులు తెలిపారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన బాలిక కోడూరి పుష్ప గానీ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం జాయింట్ కలెక్టర్ గ్రామంలో పర్యటించిన సమయంలో గ్రామంలో లేరు. కులబహిష్కరణపై ఏర్పాటు చేసున విచారణ సభకు కూడా వారు ఎవ్వరూ హాజరుకాలేదు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ షన్మోహన్ సైతం మీడియాతో విచారణకు బాధిత కుటుంబం రాలేదని, గ్రామస్థులతో మాట్లాడామని తెలిపారు.

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.