ఢిల్లీవాసులకే మా హాస్పిటల్స్ లో ‘రిజర్వేషన్’.. అరవింద్ కేజ్రీవాల్

తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు, కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ లో పడకలను  కేవలం ఢిల్లీ వాసులకే 'రిజర్వ్' చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. హాస్పిటల్స్ లో బెడ్ ల కొరతపై వివాదం రేగిన  నేపథ్యంలో..

ఢిల్లీవాసులకే మా హాస్పిటల్స్ లో 'రిజర్వేషన్'.. అరవింద్ కేజ్రీవాల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 07, 2020 | 4:00 PM

తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు, కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ లో పడకలను  కేవలం ఢిల్లీ వాసులకే ‘రిజర్వ్’ చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. హాస్పిటల్స్ లో బెడ్ ల కొరతపై వివాదం రేగిన  నేపథ్యంలో..ఆయన  ఈ సరికొత్త ప్రకటన చేస్తూ.. ‘మా ఆస్పత్రుల్లో పదివేల పడకలను ఇక్కడివారికే కేటాయిస్తున్నామని, అయితే కేంద్రం ఆధ్వర్యంలో నడిచే హాస్పటల్స్ లోని  పడకలను ఏ ప్రాంతం రోగులైనా వాడుకోవచ్ఛునని చెప్పారు. గత వారం రోజులుగా ఈ నగరంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు సుమారు వెయ్యి  చొప్పున ఈ కేసులు నమోదవుతున్నాయి. జూన్ మాసాంతానికి మా  నగరానికి కనీసం పదిహేనువేల పడకలు అవసరమవుతాయని భావిస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.