దేశ రాజధానిలో అదుపులో కరోనా.. పెరుగుతున్న రికవరీలు..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా రోజు నమోదవుతున్న కేసుల సంఖ్య గతంలోకంటే ఇప్పుడు అదుపులోకి వచ్చినట్లు గణాంకాలు తెల్పుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా రోజు నమోదవుతున్న కేసుల సంఖ్య గతంలోకంటే ఇప్పుడు అదుపులోకి వచ్చినట్లు గణాంకాలు తెల్పుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,142 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,531కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,13,068 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12,657 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 29 మంది మరణించారు. కాగా, గడిచిన కొద్ది రోజులుగా ఢిల్లీలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 13 లక్షల మార్క్ను దాటేసింది. ఇక వీటిలో 8.49 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4.5 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1,142 #COVID19 positive cases, 2,137 patients recovered/discharged/migrated and 29 deaths in Delhi today. There are 12,657 active cases. Total 1,13,068 patients have recovered/discharged/migrated, the death toll stands at 3,806: Government of Delhi pic.twitter.com/3YYhj8u7lD
— ANI (@ANI) July 25, 2020