ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఒక్కరోజే 2,137..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల్లో.. అత్యధికంగా వస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఇప్పటికే ఇక్కడ 36 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల్లో.. అత్యధికంగా వస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. ఇప్పటికే ఇక్కడ 36 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా శుక్రవారం నాడు 2,137 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 36,824కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 1214 మంది మరణించారని.. 13,398 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Delhi records the highest single-day spike after 2137 #COVID19 positive cases reported today. 71 deaths and 667 recovered/migrated/discharged today. Total number of positive cases here stands at 36,824, including 1214 deaths and 13,398 recovered/migrated/discharged: Delhi govt pic.twitter.com/ZStFD1vrwv
— ANI (@ANI) June 12, 2020