ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్… ముగ్గురు కాశ్మీరీలు, ఇద్దరు పంజాబీలు… కుట్రను ఛేదించిన ఢిల్లీ పోలీసులు
పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కశ్మీర్, ఖలిస్థాన్ ఉగ్రవాదులను అనుసంధానించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కశ్మీర్, ఖలిస్థాన్ ఉగ్రవాదులను అనుసంధానించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. షాకర్పుర్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఓ ఎన్కౌంటర్ అనంతరం ఉగ్ర కుట్రకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో ముగ్గురు కాశ్మీరీలు, ఇద్దరు పంజాబ్ కు చెందిన వారు ఉన్నారు.
కాగా, నిందితుల్లో శౌర్యచక్ర విజేత బల్వీందర్ సింగ్ను అక్టోబర్లో హత్య చేసిన నేరస్తులు పట్టుబడిన వారిలో ఉన్నారు. వారి వద్ద నుంచి పోలీసులు మూడు గన్స్, లక్ష రూపాయల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఉగ్రవాదులు పట్టుబడడానికి కారణం వారు కొంతమందిని హత్య చేసేందుకు పంజాబ్ నేరగాళ్లకు కాశ్మీరీలు నగదు ఇచ్చేందుకు వచ్చారని… ఈ క్రమంలోనే అరెస్టు చేశామని పోలీసులు దర్యాప్తు అనంతరం తెలిపారు.