మానవత్వానికి నిదర్శనం.. ఆరుసార్లు ప్లాస్మా దానం!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కాగా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడో ఢిల్లీవాసి. ఇతని కారణంగా 12 మంది ప్రాణాలు నిలబడ్డాయి.
Delhi Man donates plasma 6 times: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కాగా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడో ఢిల్లీవాసి. ఇతని కారణంగా 12 మంది ప్రాణాలు నిలబడ్డాయి. అతని పేరు తబ్రేజ్ ఖాన్. జహంగీర్పురికి చెందిన తబ్రేజ్ ఏప్రిల్ నెలలో కరోనా నుంచి కోలుకున్నాడు. అప్పటి నుంచి ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడు. ఢిల్లీలో తొలిసారి ప్లాస్మా దానం చేసిన వ్యక్తి ఇతనే. ప్లాస్మా దానం చేసిన ప్రతిసారీ ఆస్పత్రి వర్గాలో, చికిత్స పొందిన వ్యక్తి కుటుంబమో ధన్యవాదాలు చెప్తూ నాకు మెసేజిలు వచ్చాయి అని తబ్రేజ్ చెప్పాడు.
Read More:
కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన