వైసీపీ గుర్తింపు రద్దు కేసులో ఢిల్లీ హైకోర్టు నోటీసులు
తమ పార్టీ పేరును పోలివున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ...
తమ పార్టీ పేరును పోలివున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. వైసీపీతోపాటు ఎలక్షన్ కమిషన్కి కూడా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
అన్నా వైఎస్ఆర్ పార్టీ అధినేత బాషా ఈ పిటిషన్ ఢిలీ హైకోర్టులో దాఖలు చేశారు. తమ పార్టీ పేరును అధికారికంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా అన్నా వైఎస్ఆర్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిందని పిటిషన్ లో తెలిపారు.