ఢిల్లీలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్నప్పటికీ.. స్మగ్లర్లు వారి దందాలను యథేచ్చగా సాగిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున డ్రగ్స్..
దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో వణికిపోతున్నప్పటికీ.. స్మగ్లర్లు వారి దందాలను యథేచ్చగా సాగిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠాలను ఢిల్లీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో డ్రగ్ ముఠాకు చెక్ పెట్టారు. ఓ కొరియర్ టర్మినల్లో దాడి చేసిన కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. 650 గ్రాముల గ్రీనిష్-బ్రౌన్ షుగర్తో పాటు.. గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. పొడి గంజాయితో పాటు.. ద్రవ రూపంలో కూడా గంజాయిని గుర్తించామని.. అంతేకాకుండా ఇతర డ్రగ్ పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
In an operation at New Courier Terminal, Delhi y’day, Customs seized 650 g of greenish-brown dried flowers of Cannabis, premium Cannabis Oil Extract, Cannabis Oil (different brands), Cannabis concentrates&an Aromamizer: Principal Commissioner of Customs (Preventive), Delhi pic.twitter.com/83X0M3mwuV
— ANI (@ANI) July 14, 2020