ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు..
ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవు తున్నాయి. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 21...
ఈ రోజు నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవు తున్నాయి. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 21 నుంచి నిలిచిపోయిన పరీక్షలు తిరిగి ప్రారంభ అవుతుండడంతో విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్తుల తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశించారు.
అన్ని పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చేతులను శానిటైజేషన్ చేసిన తర్వాతనే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతి విద్యార్థి విధిగా మాస్కు ధరించాలని అధికారులు ముందుగానే తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా వాటర్ బాటిల్తో హాజరుకావాలని వర్సిటీ అధికారులు సూచించారు.